YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పసికూన ఫై అలవోకగా..రోహిత్‌, ధావన్‌ వీరవిహారం..!!

 పసికూన ఫై అలవోకగా..రోహిత్‌, ధావన్‌ వీరవిహారం..!!

నిన్న జరిగిన మొదటి టీ20 లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచినా ఐర్లాండ్ భారత్ ను బ్యాట్టింగ్ కు పంపింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (61 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 97), శిఖర్‌ ధవన్‌ (45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 74)ల మెరుపులకు స్పిన్నర్లు కుల్దీప్‌ (4/21), చాహల్‌ (3/38) జోరు తోడైన వేళ ఐర్ల్లాండ్‌తో తొలి టీ20లో భారత్‌ అలవోకగా గెలిచింది. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఐర్ల్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 132/9 స్కోరుకే పరిమితమైంది. జట్టులో షానన్‌ (60) టాప్‌ స్కోరర్‌. అంతకుముందు కోహ్లీసేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది.

Related Posts