YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రాన్సిట్ హాల్ట్ ప్రయాణికులకు దుబాయ్ ప్రభుత్వం 48 గంటల ఉచిత వీసా

ట్రాన్సిట్ హాల్ట్ ప్రయాణికులకు దుబాయ్ ప్రభుత్వం 48 గంటల ఉచిత వీసా

దేశంలో అత్యధిక రద్దీ ఉండే అంతర్జాతీయ విమానయాన మార్గం దుబాయ్-ముంబయ్. ఏటా ఈ మార్గంలో 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. 2017-18 కాలంలో ఈ గణంకాల ప్రకారం . ఈ మార్గంలో ఎక్కువ మంది వలస కార్మికులు, మధ్య ప్రాచ్య దేశాల్లోని వ్యాపార మార్కెట్లకు వెళ్ళే పారిశ్రామికవేత్తలు ఉంటారని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు వెళ్లే సీట్లలో సగం వాటా యుఏఈనే దక్కించుకుంటోంది.దుబాయ్-ముంబయ్ తోపాటు తర్వాత రద్దీ ఉండే రూట్లలో దుబాయ్-ఢిల్లీ, దుబాయ్-కొచ్చి ఉన్నాయి. ఈ మధ్యే అంతర్జాతీయ ప్రయాణికులకు దుబాయ్ ఓ శుభవార్త ప్రకటించింది. అమెరికా వెళుతూ ట్రాన్సిట్ హాల్ట్ కింద ఆగే ప్రయాణికులకు దుబాయ్ ప్రభుత్వం 48 గంటల ఉచిత వీసా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దుబాయ్ కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Posts