YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

నవంబర్ 14 నుంచి రామాయణ దర్శన్

నవంబర్ 14 నుంచి రామాయణ దర్శన్
భారత రైల్వే ‘శ్రీరామయణ’ పేరుతో ప్రత్యేక టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తేనుంది. రామాయణంలో ప్రస్తావించిన పుణ్యస్థలాలు మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. ఢిల్లీలో నవంబరు 14 నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక రైల్లో 800 మంది ప్రయాణించవచ్చు. ఈ ప్యాకేజీ టికెట్ ధర రూ.15,120. శ్రీరాముడు దేశంలో సంచరించిన ప్రాంతాలకే గాక.. శ్రీలంకలోని కొలంబో వెళ్లేందుకు కూడా ఇందులో ఆప్షన్ ఉంది. అక్కడ శ్రీరాముడు.. రావణుడితో తలపడిన ప్రాంతం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం సందర్శన తర్వాత చెన్నై నుంచి విమానంలో కొలంబోకు తీసుకెళ్తారు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న అన్ని శ్రీరాముడి క్షేత్రాలను కలుపుతూ ఈ ప్రయాణం సాగుతుందని ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి. అయోధ్యలోని హునుమాన్ గర్హీ, కనక్ భవన్ ఆలయం, రామ్‌కోట్, నందిగ్రమ్, సితామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రీనగవెర్పూర్, చిత్రకోట్, నాసిక్, హంపీ, రామేశ్వరం మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. మొత్తం 16 రోజుల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అయితే, కొలంబో వెళ్లేందుకు అవసరమైన విమాన టికెట్ల రుసుమును ఈ ప్యాకేజీలోనే చేర్చారా, లేదా ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలా అనేది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఈ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. 

Related Posts