YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రికి ఐదేళ్ల జైలు శిక్ష

 అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రికి  ఐదేళ్ల జైలు శిక్ష

- థాయిలాండ్లో  సబ్సిడీ పథకాన్ని దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పు 

థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి ఇంగ్లక్ షినవత్రాకు ఆ దేశ సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బియ్యం పథకం అమలులో ఆమె నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడినట్లు న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.

బియ్యం సబ్సిడీ పథకాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ పథకంలో దాదాపు 8 బిలియన్ డాలర్లు (రూ. 52,364 కోట్లు) మేరకు నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలొచ్చాయి.

2014లో సైనిక తిరుగుబాటు అనంతరం ఆమె అభిశంసనకు గురయ్యారు. అయితే షినవత్రా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తీర్పు వెలువడకముందే ఆమె దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె దుబాయిలో ఉన్నట్లు సమాచారం.

అయితే ప్రజల్లో దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గ్రామీణ, పేద ఓటర్లలో ఇంకా ఆమెకు ఇంకా ప్రజాదరణ ఉంది.

సబ్సిడీ బియ్యం పథకంలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసినా ఆమె దాన్ని అడ్డుకోలేకపోయారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

'ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి బియ్యం కాంట్రాక్టు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఆ విషయం తెలిసి కూడా ఆమె అడ్డుకోలేకపోయారు' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

'ఇది చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందే పద్ధతి. అందువల్లే ఆమె చేసిన పనిని విధినిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నాం' అని కోర్టు తెలిపింది.

అయితే ఈ పథకం రోజువారీ అమలుకు తాను బాధ్యురాలిని కానని ఆమె కోర్టు విచారణ సమయంలో వాదించారు. తాను రాజకీయ బాధితురాలినని చెప్పుకొచ్చారు.

ఈ తీర్పుపై బీబీసీ జర్నలిస్టు జొనాథన్ హెడ్… బ్యాంకాక్ లో మాట్లాడుతూ, "ఒక పథకానికి గాను దేశ ప్రధానమంత్రిని దోషిగా ప్రకటించడమనేది గతంలో ఎన్నడూ చూడని పరిణామం. ఈ పథకం ఆమె తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తీసుకొచ్చారు" అన్నారు. 'అవినీతిలో ప్రత్యక్షంగా ఆమె ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు' అని ఆయన విశ్లేషించారు.

Related Posts