YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వన్డేల్లో అమీతుమీ.. నేడే తొలి మ్యాచ్..!!

వన్డేల్లో అమీతుమీ.. నేడే తొలి మ్యాచ్..!!

ప్రపంచంలో మేటి వన్డే జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి.. ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. 2017 జనవరిలో సొంతగడ్డపై ఇంగ్లాండ్ మీద భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ కోల్పోలేదు. ఈ మధ్యనే ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ సొంతం చేసుకుని టెస్టులకు ముందు ఆ జట్టు విశ్వాసాన్ని దెబ్బతీయాలని పట్టుదలగా ఉంది కోహ్లి బృందం. టీ20 సిరీస్‌ గెలిచి జోరుమీదున్న కోహ్లిసేన. వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకుని టెస్టులకు ముందు పూర్తి విశ్వాసం కూడగట్టుకోవాలని చూస్తుండగా.. వన్డేల్లో అగ్రస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది ఇంగ్లాండ్‌. క్లీన్‌స్వీప్‌ చేస్తే నం.1 భారత్‌ సొంతమవుతుంది.

Related Posts