YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం.. మెరిసిన కుల్‌దీప్‌, రోహిత్‌..!!

Highlights

  •  సెంచరీ చేసిన రోహిత్.
  •   6 వికెట్లు తీసిన కుల్దీప్
  • బట్లర్, స్టోక్స్  శ్రమ వృధా.
తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం.. మెరిసిన కుల్‌దీప్‌, రోహిత్‌..!!

ఇంగ్లాండ్ లో జరుగుతున్న వన్డే  సిరీస్‌ లో భారత్‌ అద్భుతంగా ఆరంభించింది.  నిన్న జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నాడు కోహ్లీ. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బట్లర్‌ (53), స్టోక్స్‌ (50) అర్ధ సెంచరీలు చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రాయ్‌, బెయిర్‌స్టో శుభారంభాన్ని అందించారు. కానీ అది కేవలం 10.2 ఓవర్ల వరకే.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ ఆడుకున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకా లు (6/25) నమోదు చేసాడు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌ మరోసారి క్లాస్‌ ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. 40.1 ఓవర్లలో 2వికెట్లకు 269 పరుగులు చేసి విజయం సాధించింది. 

Related Posts