YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

లార్డ్స్ లో ఒక సిక్స్ కూడా నమోదు కాలేదు..!!

లార్డ్స్ లో ఒక సిక్స్ కూడా నమోదు కాలేదు..!!

 వన్డే మ్యాచ్‌ అంటే బౌండరీల మోతను ఆశిస్తారు అభిమానులు. కానీ, ఒక జట్టు ఆ మ్యాచ్‌లో ఒక సిక్స్‌ కూడా బాదలేదంటే నమ్మగలమా.  ఔను... శనివారం లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.  ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున 16 బౌండరీలు మాత్రమే నమోదు కాగా అవన్నీ ఫోర్లే. కోహ్లీ సేన ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయకపోవడం విశేషం.  2011లో ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడిన భారత్‌ అప్పుడూ ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ఇలా తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయలేకపోయింది.

Related Posts