YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ గా రమేశ్‌ పవార్‌..!!

 భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ గా రమేశ్‌ పవార్‌..!!

 భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ బాధ్యతలను మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌కు అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం భారత్‌ మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ క్రీడాకారిణులు కోచ్‌ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్‌ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్‌ జట్టుతో కలవనున్నాడు.

Related Posts