YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

చెన్నైలో దారుణం

చెన్నైలో దారుణం

 

ఏడో తరగతి చదువుతోన్న పన్నెండేళ్ల బాలికపై ఏడు నెలలుగా 22 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన చెన్నైలో సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ గార్డులు, లిఫ్ట్ ఆపరేటర్, ప్లంబర్ సహా అపార్ట్మెంట్లో పని చేసే 22 మంది ఈ అఘాయిత్యానికి పాల్పడటం విస్మయానికి గురి చేస్తోంది. వినికిడి సంబంధ సమస్య ఉన్న బాలికపై నెలల తరబడి అత్యాచారం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు 18 మందిని సోమవారం అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి, ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్ ఇచ్చిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే దాన్ని బయట పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన బాలిక వారు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. ఆ చిన్నారి అసహాయతను తమకు అనుకూలంగా మలుచుకున్న దుర్మార్గులు నెలల తరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గత శనివారం వరకూ ఆ దుర్మార్గులు తమకు వీలైనప్పుడల్లా బాలికపై అత్యాచారం చేశారు. ఢిల్లీలో చదువుకుంటున్న తన సోదరి ఇటీవలే చెన్నై రావడంతో బాధితురాలు ఆమెతో తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన ఆమె.. తల్లిదండ్రుల సాయంతో అయనవరం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి కుమార్ అనే 66 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్ మొదట తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీసులకు చెప్పింది. మూడ్రోజుల తర్వాత అతడు మద్యం సేవించిన మరో ఇద్దర్ని తీసుకొచ్చాడు. వారిద్దరూ రేప్ చేయడంతోపాటు వీడియో తీశారు. కొద్ది రోజుల తర్వాత మరికొందరు ఆ బాలికపై అత్యాచారం చేశారు. లిఫ్ట్ ఆపరేటర్ నుంచి సెక్యూరిటీ గార్డ్, హౌస్ కీపింగ్ సిబ్బంది వరకు.. 66 ఏళ్ల ముసలాడి నుంచి 23 ఏళ్ల కుర్రాడి వరకు ఆ పసిదానితో తమ పశువాంఛను తీర్చుకున్నారు.అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్లు ఖాళీగా ఉండటం బాలిక పాలిట శాపమైంది. స్కూల్ బస్ దిగింది మొదలు తమ ఫ్లాటులోకి వెళ్లేలోగా బేస్మెంట్, పబ్లిక్ వాష్రూమ్లు, టెర్రస్, జిమ్.. ఇలా వీలైన ప్రతి చోటా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. బాధితురాలి తండ్రి పని నిమిత్తం బయటకెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఇంతటి దారుణాన్ని ఊహించలేకపోయిన బాలిక తల్లి.. తన కూతురు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుందని, అందుకే ఇంటికి ఆలస్యంగా వస్తోందని భావించింది. 

Related Posts