YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మూడో వన్డేలో భారత్ పరాజయం.. సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్..!!

Highlights

  •  విఫలమైన బ్యాట్స్‌మెన్‌.. నిరాశపరిచిన బౌలర్లు
  • మెరిసిన రూట్‌, మోర్గాన్‌
  • మ్యాన్ అఫ్ ది సిరీస్ రూట్
 మూడో వన్డేలో భారత్ పరాజయం.. సిరీస్ ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్..!!

వన్డేల్లో టీమ్‌ ఇండియా సిరీస్‌ విజయపరంపరకు తెరపడింది. నిన్న జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్‌ 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. మంగళవారం రషీద్‌ (3/49), విల్లీ (3/40) విజృంభించడంతో మొదట భారత్‌ 256/8తో సరిపెట్టుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (71; 72 బంతుల్లో 7×4) విలువైన ఇన్నింగ్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్‌ (44; 49 బంతుల్లో 7×4), ధోని (42; 66 బంతుల్లో 4×4) రాణించారు. రూట్‌ (100 నాటౌట్‌; 120 బంతుల్లో 10×4), మోర్గాన్‌ (88 నాటౌట్‌; 108 బంతుల్లో 9×4, 1×6) మెరవడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 44.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

Related Posts