YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాక్ ఎన్నికల్లో అమితాబ్, మాధురీలు

పాక్ ఎన్నికల్లో అమితాబ్, మాధురీలు
పాకిస్థాన్‌లో మరో రెండు రోజుల్లో  సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీక్‌ - ఎ - ఇన్సాఫ్‌) పార్టీకి చెందిన ఓ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పోస్టర్లపై పార్టీ అభ్యర్థి ఫొటోతో పాటు బాలీవుడ్‌ దిగ్గజాలు అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌ ఫొటోలు ఉండటమే అందుక్కారణం. పాకిస్థాన్‌లోని ముల్తాన్‌‌లో ఓ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న సర్దార్ అబ్బాస్ డోగార్ తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లలో బిగ్ బి, మాధురి ఫొటోలను వాడుకుంటున్నట్లు పాకిస్థానీ జర్నలిస్టు ఒకరు ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘పాకిస్థాన్ ఎన్నికల బరిలో బాలీవుడ్ దిగ్గజాలు మాధురి, అమితాబ్..’ అంటూ ఓ నెటిజన్ కామంట్ పెట్టగా, పాక్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లనున్న దిగ్గజాలు అంటూ మరో నెటిజన్ ఛలోక్తి విసిరారు. భారతీయ సినిమాలను పాక్‌లో విడుదల చేయడాన్ని అడ్డుకుంటారు.. కానీ, బాలీవుడ్ నటీనటులను మాత్రం తమ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’ అంటూ ఓ నెటిజన్ పెదవి విరిచాడు. పాక్‌లో బాలీవుడ్ సినిమాల విడుదలపై ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Related Posts