YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

విదేశీ ప్రతినిధులకు నో ఇన్విటేషన్

విదేశీ ప్రతినిధులకు నో ఇన్విటేషన్
పాక్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ ప్రధానిగా ఆగస్టు 11 న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత వెటరన్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూతోపాటు బాలీవుడ్ నటుడు అమీర్‌ ఖాన్‌లను సైతం ఇమ్రాన్ ఆహ్వానం పంపారు. తనను ఇమ్రాన్ ఆహ్వానించడం పట్ల మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. తాను ఇమ్రాన్‌ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని, కార్యక్రమానికి తప్పకుండా హాజరుతానని సిద్ధూ ప్రకటించారు. ఇమ్రాన్‌ నాయకత్వంలోనే పాకిస్థాన్‌ ప్రపంచ కప్పు చేజిక్కించుకుందని, ఆయన నమ్మదగిన వ్యక్తి అని సిద్ధూ ప్రశంసలు కురిపించారు. తనకు ఆహ్వానం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సిద్ధూ పేర్కొన్నారు. ఖాన్‌ సాహెబ్‌ గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి అని, నమ్మకస్తుడు అని సిద్ధూ కితాబిచ్చారు. క్రీడాకారుడు అడ్డుగోడలను కూలగొట్టి వంతెనలను నిర్మించి, ప్రజలను ఐక్యం చేస్తారని సిద్ధూ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. జులై 25 న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పీటీఐ పార్టీ 116 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా, సాధారణ మెజార్టీకి అవసరమైన సంఖ్యకు దగ్గరలోనే ఆగిపోయింది. చిన్న పార్టీల మద్దతుతో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సార్క్ దేశాధినేతలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై విదేశాంగ శాఖను పీటీఐ ప్రతినిధులు సంప్రదించారు. వారి అభిప్రాయం తర్వాత విదేశీ నేతలకు ఆహ్వానం పంపనున్నారు.

Related Posts