YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

విరాట్ ఒంటరి పోరాటం..!!

 విరాట్ ఒంటరి పోరాటం..!!

విరాట్‌ కోహ్లి అద్భుత పోరాటపటిమను ప్రదర్శించిన వేళ.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ వడివడిగా పెవిలియన్‌కు చేరిన వేళ కెప్టెన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.  దీంతో రెండో రోజు గురువారం తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 76 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కుక్‌ (0) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు సాధించింది.

Related Posts