వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోపై హత్యయత్నం జరిగింది. శనివారం సాయంత్రం సైనిక కవాతుల పాల్గొన్న ఆయనపై డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు ఆయనకు సమీపంలో పేలడంతో ఈ ఘటన సంభవించింది. అయితే, ఇందుకు కారణం లెఫ్ట్ పార్టీలేనని ఆ దేశ మంత్రి జార్జ్ రోడ్రిగోజ్ ఆరోపించగా, దేశాధినేత మాత్రం ఇది పొరుగు దేశమైన కొలంబియా పనేనని ఆరోపిస్తున్నారు.