YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మరోసారి విఫలమైన భారత బ్యాట్స్‌మెన్‌..!!

 మరోసారి విఫలమైన భారత  బ్యాట్స్‌మెన్‌..!!

 రెండో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మూకుమ్మడిగా విఫలమయ్యారు. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో చెలరేగారు. ముఖ్యంగా జేమ్స్‌ ఆండర్సన్‌ (5/20) ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ (29) మాత్రమే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Related Posts