YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

250 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..!!

 250 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్..!!

ఇంగ్లాండ్‌, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట ముగిసింది. మరో 9 ఓవర్లు ఉండగానే వెలుతురులేమితో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 250 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఇంగ్లాండ్‌ ఉంది. క్రీజులో క్రిస్‌ వోక్స్‌ (159 బంతుల్లో 120; 18×4), కరన్‌ (24 బంతుల్లో 22; 4×4) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బెయిర్‌స్టో (144 బంతుల్లో 93; 12×4), పోప్‌(28), కుక్‌(21), రూట్‌(19), జెన్నింగ్స్‌(11), బట్లర్‌(24) పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమి 3, పాండ్య 2, శర్మ ఒక వికెట్‌ పడగొట్టారు.

Related Posts