YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీమ్‌ఇండియాకు అగ్నిపరీక్ష.. మూడో టెస్టు నేటి నుంచే..!!

 టీమ్‌ఇండియాకు అగ్నిపరీక్ష.. మూడో టెస్టు నేటి నుంచే..!!

 రెండు టెస్టుల్లో ఓటమి.. లార్డ్స్‌లో అయితే మరీ ఘోర పరాభవం.. దారుణమైన ఫామ్‌లో బ్యాట్స్‌మెన్‌.. బౌలింగూ కూడా గొప్పగా ఏమీ లేదు.. అన్నీ ప్రతికూలతలే. అన్నీ సవాళ్లే. సిరీస్‌ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా కీలక సమరానికి సన్నద్ధమైంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు హాట్‌ఫేవరెట్‌గా పరిగణించిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలతో 5 టెస్టుల సిరీస్‌ను చేజార్చుకునే స్థితిలో నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ బౌలర్లకు తలవంచిన టీమిండియా.. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రోజు నుంచి  ట్రెంట్‌బ్రి డ్జ్‌లో మొదలయ్యే మూడో టెస్టులో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. సిరీస్ లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో అమీతుమీకి కోహ్లీసేన సిద్ధమైంది. కాగా, ఎన్నో రోజులుగా టెస్టు ల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న 20 ఏళ్ల వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది.

Related Posts