YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రాణించిన కోహ్లీ.. భారత స్కోర్ 307/6

 రాణించిన కోహ్లీ.. భారత స్కోర్ 307/6

ఇంగ్లాండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డ టీమ్‌ఇండియా.. మూడో టెస్టును ఆశావహ దృక్పథంతో ఆరంభించింది. తొలి రోజు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 307 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (97; 152 బంతుల్లో 11×4), వైస్‌కెప్టెన్‌ రహానె (81; 131 బంతుల్లో 12×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. వోక్స్‌ (3/75) భారత్‌ను దెబ్బ తీశాడు. అరంగేట్ర ఆటగాడు రిషబ్‌  22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అశ్విన్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ఎక్కడిదాకా తీసుకెళ్తాడన్నది ఆసక్తికరం.

Related Posts