YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 329 ఆలౌట్‌..!!

 మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 329 ఆలౌట్‌..!!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. ‘తోక’ బ్యాట్స్‌మెన్‌ కాసేపైనా నిలబడలేదు. కేవలం ఆరు పరుగుల తేడాతో టీమిండియా చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లాండ్‌ బౌలర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌, అండర్సన్‌ కోహ్లీసేన భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. పదునైనా స్వింగ్‌ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇంగ్లిష్‌ గడ్డపై చేసిన అత్యధిక తొలి ఇన్నింగ్స్‌ స్కోరు ఇదే (329)కావడం గమనార్హం.

Related Posts