YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

శతకంతో చెలరేగిన కోహ్లీ.. ఇంగ్లాండ్ లక్ష్యం 521..!!

 శతకంతో చెలరేగిన కోహ్లీ.. ఇంగ్లాండ్ లక్ష్యం 521..!!

ఫార్మాట్‌ ఏదైనా తనకు తానే సాటి అని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (197 బంతుల్లో 10 ఫోర్లతో 103) మరోసారి నిరూపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగుల తేడాతో కోల్పోయిన శతకాన్ని మూడో రోజు మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడి సాధించాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 110 ఓవర్లలో ఏడు వికెట్లకు 352 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఫలితంగా జట్టుకు 520 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ప్రత్యర్థికి 521 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు, సోమవారం ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 9 ఓవర్లాడి వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కుక్‌ (9), జెన్నింగ్స్‌ (13) క్రీజులో ఉన్నారు.

Related Posts