YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది

ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది
ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనిక రాష్ట్రంలో ఉన్న తెలంగాణ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని... ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీ క్రమంగా అప్పుల నుంచి బయటపడుతోందని నివేదిక పేర్కొంది. గత ఏడాది కాలంలో తెలంగాణ అప్పులు 9.5 శాతం పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. 2016-17లో రాష్ట్ర జీడీపీపై అప్పు 12.7శాతంగా ఉందని... 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇది 22.2 శాతానికి పెరిగిందని వెల్లడించింది.ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర జీడీపీపై అప్పులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 36.4శాతంగా ఉండగా... 2017-18కి అది 9.1శాతం తగ్గి 27.3 శాతానికి దిగివచ్చిందని ఆర్బీఐ తెలిపింది

Related Posts