YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మరో మైలురాయిని అధికమించిన జగన్‌

Highlights

  • రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయి
  • పాదయాత్రలో  266.5 కిలోమీటర్ల నడక 
  • 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన యాత్ర
  • నెల్లూరు జిల్లాలో 20 రోజులు
  •  
మరో మైలురాయిని  అధికమించిన జగన్‌

 వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మైలుప్రజాసం కల్పయాత్ర మరో మైలురాయి అధిగమించింది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఓ మొక్కను నాటారు. ఆయునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్రను ముగించుకుని శుక్రవారం ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టారు. లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామం వద్ద  ప్రకాశం జిల్లా వాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. జగన్ ఇంతకుముందు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో 20 రోజులు పాదయాత్ర చేశారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రలో జగన్ 266.5 కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా ప్రజల సవుస్యలను తెలుసుకుంటూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Related Posts