
విశాఖపట్నం
ఈ నెల 21న జరిగే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో యోగా అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అనిత, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.