YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పన్ను మినహాయిపుపై బడ్జెట్ లో ఆశలు

పన్ను మినహాయిపుపై బడ్జెట్ లో ఆశలు

కేంద్ర ప్రభుత్వం 2019 మధ్యంతర బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతుందా? లేదా? పన్ను చెల్లింపుదారులందరికీ ఇప్పుడు ఇదే ప్రశ్న మదిలో మెదిలుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు పన్ను ప్రయోజనాలు అందించొచ్చని సర్వత్రా అంచనాలున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో ఉద్యోగులకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు అందించే అవకాశముందని జాతీయా మీడియా పేర్కొంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్‌లో తాయిలాలు ఉండే అవకాశముందని తెలిపింది. పొదుపు పరిమితి పెంపు, పెన్షనర్లకు పన్ను ప్రయోజనాలు, ఇంటి రుణాలపై రాయితీలు వంటి అంశాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు చేసే అవకాశముందని అందరూ అంచనా వేస్తున్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచొచ్చని అందరూ భావిస్తున్నారు. 

ప్రస్తుత ఆదాయపు పన్ను రేట్లను గమనిస్తే..

వార్షిక ఆదాయం పన్ను రేటు

రూ.2.5 లక్షల వరకు లేదు

రూ.2.5-5 లక్షలు 5 శాతం

రూ.5-10 లక్షలు 20 శాతం

రూ.10 లక్షలు పైన 30 శాతం

60 ఏళ్లు నుంచి 80 లోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. అదే 80 ఏళ్లు పైన ఉన్నవారు రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. అదేసమయంలో 50 లక్షలు పైన ఆదాయం ఉన్న వారు పన్ను రేటుపై 10 శాతం సర్‌చార్జ్ చెల్లించాలి. అదే ఆదాయం రూ.కోటి దాటితే 15 శాతం సర్‌చార్జ్ కట్టాలి. పన్ను చెల్లింపుదారులపై అదనంగా 4 శాతం సెస్సు పడుతుంది. సాధారణంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.15,000 వరకు, రవాణా భత్యం కింద రూ.19,200 పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్‌లో వీటి స్థానంలో రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రవేశపెట్టింది. 2017 బడ్జెట్‌లో రూ.2.5 లక్షలు నుంచి రూ.5 లక్షల ఆదాయపు శ్లాబ్‌పై పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దాదాపు 50 శాతం కోత విధించింది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు రూ.12,500 ఆదా అయ్యింది. 2015 బడ్జెట్‌లో రవాణా భత్యంపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.19,200లకు పెంచింది. ఇక 2014 బడ్జెట్‌లో బేసిక్ ఆదాయపు పన్ను శ్లాబ్‌ని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. అలాగే 80సీ కింద డిడక్షన్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచింది. ఇంటి రుణంపై వడ్డీ మినహాయింపును రూ.2 లక్షలు చేసింది. 

Related Posts