
హైదరాబాద్
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో... ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో... మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వసలహాదారుడు షబ్బీర్ అలీలతో కలిసి ఒవైసీ పాల్గొన్నారు.
ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేసిన అనంతరం ఓవైసీ మాట్లాడుతూ... ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు.
భారతదేశం నుండి విడిపోయిన తరువాత పాకిస్తాన్... ఇక్కడి హిందువులకు, ముస్లిం ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. పెహాల్గామ్ లో కుటుంబ సభ్యుల ముందు అతికిరతకంగా హతమార్చారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని... దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుంది. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, సైనికులకు అండగా ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.