YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోషల్ మీడియాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

సోషల్ మీడియాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఛాలెంజ్ ఇది. పదేళ్ల ముందు మీరెలా ఉన్నారు.. ఇప్పుడెలా ఉన్నారు? అంటూ పాత, కొత్త ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. ఈ ఛాలెంజ్ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విశేష స్పందన వస్తోంది. సినీతారలు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ ఛాలెంజ్ స్వీకరించి #10ఇయర్ ఛాలెంజ్  హ్యాష్ ట్యాగ్‌కి తమ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొందరైతే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఛాలెంజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ ఐదేళ్లలో దేశంలో వచ్చిన మార్పులను సూచిస్తూ # ఇయర్ ఛాలెంజ్  హ్యాష్‌టాగ్ ద్వారా బీజేపీ వరుస పోస్టులు పెడుతోంది. మోదీ ప్రధాని అయ్యాక ఈ ఐదేళ్లలో దేశం ఎలా డెవలప్ అయింది, యూపీఏ, ఎన్డీయే పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలకు తెలిసేలా ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఛాలెంజ్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. 2014లో 56 అంగుళాలున్న మోదీ ఛాతీ.. ఐదేళ్లలో 36 అంగుళాలకు తగ్గిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ పోస్టులు పెడుతోంది. ఇరు పార్టీల మధ్య ఈ సోషల్‌మీడియా వార్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాలి. 

Related Posts