YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పసిడి ధరలకు బ్రేక్

పసిడి ధరలకు బ్రేక్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర రెండు రోజుల పెరుగుదలకు బ్రేక్ పడింది. బంగారం ధర బుధవారం తగ్గింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,210కు క్షీణించింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు కారణం. బంగారం ధర తగ్గితే.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.310 పెరుగుదలతో రూ.40,160కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు బంగారంపై నెగటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం క్షీణతతో 1,284.30 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,210కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,060కు తగ్గింది. కాగా బంగారం ధర మంగళవారం రూ.125 పెరిగింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.25,500ల వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.40,000 మార్క్ పైకి పెరిగితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.311 పెరుగుదలతో రూ.39,197కి ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000 ఉండగా.. అమ్మకం ధర రూ.78,000గా స్థిరంగా కొనసాగాయి.

Related Posts