
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సన్మానించారు. ఈ సందర్భముగా విజయం సాధించిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో బాగా పని చేసి మంచిపేరు సంపాదించుకోవాలి అని అన్నారు. గ్రామాలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు. తానూ ఎల్లప్పుడూ అండగా ఉంటా నాని అన్నారు.ప్రజలకు ఈవిఎంలపై నమ్మకం లేదు. చాలా అపోహలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ పాత విధానం కొనసాగించాలి అని అన్నారు. ఈ కార్యక్రమములో ఎడ్ల రాజిరెడ్డి , కైలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.