YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు

జల్లికట్టులో నలుగురు మృతి

జల్లికట్టులో నలుగురు మృతి

విజేతలకు భారీ బహుమతులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు(పరుగెత్తుతున్న ఎద్దులను నిలువరించడం)లో ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. సోమవారం పలమేడు జిల్లాలో 19 ఏండ్ల యువకుడు మరణించగా, మంగళవారం శివగంగలో ఇద్దరు, తిరుచిరాపల్లిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జల్లికట్టులో ఈ విధంగా పలువురు గాయపడటం, ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు జల్లికట్టును ప్రోత్సహిస్తూ ప్రకటనలు చేయడం విశేషం. మంచి ప్రదర్శన చూపిన వ్యక్తులకు విలాసవంతమైన కార్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాము సింగపూర్ విమాన టిక్కెట్లు ఇస్తామని ఏఐఏడీఎంకే తిరుగుబాటు నాయకుడు దినకరన్ ప్రకటించారు. విజేతలకు బంగారు ఉంగరాలు అందజేస్తామని డీఎంకే ప్రకటన చేసింది. ఇప్పటికే మదురైలో విజేతలకు కార్లు, సింగపూర్ విమాన టిక్కెట్లు అందజేశారు. ఈ ఉత్సవాల్లో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పాల్గొన్నారు.

Related Posts