YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మళ్లీ ఫామ్ లోకి రోహిత్ శర్మ

మళ్లీ ఫామ్ లోకి రోహిత్ శర్మ
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో 3x4, 4x6 సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. పొట్టి క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌లు నెలకొల్పాడు. ఈరోజు 50 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ 2,272 పరుగులతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అగ్రస్థానంలో ఉండగా.. 2,288 పరుగులతో అతడ్ని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ నెం.1 స్థానానికి ఎగబాకాడు.  మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. తక్కువ వ్యవధిలోనే టీ20ల్లో ఎక్కువ విజయాల్ని అందుకున్న టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచకప్ నేపథ్యంలో.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. కివీస్‌పై టీ20 సిరీస్‌లో జట్టుని నడిపిస్తున్న రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా ఈరోజు 12వ విజయాన్ని అందుకున్నాడు. అతని కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన భారత్ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. కివీస్‌పై అర్ధశతకం సాధించడం ద్వారా.. టీ20ల్లో అత్యధికసార్లు 50+ స్కోరు సాధించిన క్రికెటర్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. కెరీర్‌లో 92వ టీ20 మ్యాచ్ ఆడిన ఈ ఓపెనర్ ఇప్పటి వరకూ 20సార్లు 50+ మార్క్‌ని అందుకున్నాడు. ఇందులో 16 అర్ధశతకాలు, నాలుగు శతకాలున్నాయి. మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డ్‌లో క్రిస్‌గేల్, మార్టిన్ గప్తిల్ సంయుక్తంగా 103 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 102 సిక్సర్లతో నిలిచాడు. 

Related Posts