YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హామిల్టన్ పోరుపై తీవ్ర ఉత్కంఠ

 హామిల్టన్ పోరుపై తీవ్ర ఉత్కంఠ

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

న్యూజిలాండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలుపు ముంగిట భారత్ నిలిచింది. తాజా పర్యటనలో ఇప్పటికే రెండు టీ20లు ఆడిన టీమిండియా.. ఒక ఓటమి, గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌‌లో ప్రస్తుతం 1-1తో కొనసాగుతోంది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే..? ఆ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా రికార్డుల్లో నిలవనుంది. కానీ.. హామిల్టన్ స్టేడియంలో ఇటీవల పేలవ రికార్డ్ భారత్‌ని కంగారు పెడుతోంది. గత వారం హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 30.5 ఓవర్లలో పేలవంగా 92 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డ్‌లో చేరింది. బౌన్స్, స్వింగ్‌కి అనుకూలించిన ఆ పిచ్‌పై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (5/21) ధాటికి భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేక చేతులెత్తేయగా.. పదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మణికట్టు స్పిన్నర్ చాహల్ (18: 37 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు 14.4 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని ఛేధించి 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆదివారం మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగానే జరుగుతుండటంతో.. భారత్ జట్టు బదులు తీర్చుకుంటుందా..? లేక మరోసారి ఆ పిచ్‌పై తడబడుతుందా..? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. దీనిపై భారత్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ‘హామిల్టన్ పిచ్‌పై మేము ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడాం. కాబట్టి.. మాకు ఆ పిచ్ కొత్త కాదు. అంతేకాకుండా.. రెండో టీ20లో గెలవడం ద్వారా జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. మూడో టీ20లో తప్పకుండా గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు. 

Related Posts