YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఖాతాను తెరిచిన గంటల్లోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్స్

ఖాతాను తెరిచిన గంటల్లోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్స్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఖాతాను తెరిచిన గంటల్లోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్స్అయ్యారు.ఆమె ఏవరో కాదు కొద్ది రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు  చేపట్టిన ప్రియాంక గాంధీ.తాజాగా ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. సోమవారం ఉదయం 11.49 నిమిషాలకు ప్రియాంక గాంధీ ట్వీట్టర్ ఖాతాను తెరిచారు. దీంతో కొన్ని గంటల్లోనే ఆమెకు 45 వేల మంది ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ఒక్క పోస్టు కూడా చేయకపోవడం గమనార్హం.అయితే ప్రియాంక ఫాలోయింగ్ ను చూసి కాంగ్రెస్ శ్రేణులు మురిసిపోతున్నారు. కొన్ని నిమిషాల్లోనే 45 వేల మంది ఫాలోవర్స్ కావడంతో మరికొన్ని రోజుల్లో కోటి ఫాలోవర్స్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పలువురు నేతలు అన్నారు. ప్రియాంక గాంధీ తొలి సారిగా లక్నోలో రోడ్డు షోలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం ప్రారంభమైంది. 

Related Posts