YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘ది కపిల్‌ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్‌, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అవుట్

‘ది కపిల్‌ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్‌, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అవుట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

హాస్యనటుడు కపిల్‌శర్మ సారథ్యంలో నిర్వహించే టీవీ షో ‘ది కపిల్‌ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను తప్పించారు. పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై ఆయన చేసిన సానుభూతి వ్యాఖ్యలు ఈ చర్యలకు కారణమని తెలుస్తోంది. పుల్వామా దాడిపై నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సిద్ధూపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందులో కొందరు కపిల్‌ శర్మ షో నుంచి సిద్ధూను తొలగించాలనే డిమాండ్‌ను లేవనెత్తారు. దీంతో షో యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు.  ఆయన స్థానంలో ఇక నుంచి అర్చన పురాణ్‌ సింగ్‌ను షోలో కొనసాగించనున్నారు. ఇటీవల సిద్ధూ కొన్ని కారణాల వల్ల షోకు హాజరుకాకపోవడంతో ఆయన స్థానంలో అర్చనతో రెండు ఎపిసోడ్‌లను తెరకెక్కించారు. తాజాగా సిద్ధూ వ్యాఖ్యల నేపథ్యంలో టీవీషో కూడా అనవసర వివాదంలో చిక్కుకుంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు సిద్ధూను తప్పించి, అర్చననే కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.సోనీటీవీ గతంలోనూ వివాదాలు చుట్టుముట్టిన సెలబ్రిటీలను షో నుంచి తప్పించిన సంఘటనలున్నాయి. ‘మీటూ’ ఉద్యమంలో అను మాలిక్‌ పేరు రావడంతో రాత్రికి రాత్రే అతడ్ని ఇండియన్‌ ఐడల్‌ 10 జడ్జిగా తప్పించారు.

Related Posts