YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్ ముందు భారీ టార్గెట్..!!

భారత్ ముందు భారీ టార్గెట్..!!

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: 

భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరును సాధించింది.  అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ ఫించ్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 99 బంతుల్లో 93 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ కూల్చాడు. మ్యాక్స్ వెల్ రనౌట్ గా వెనుదిరిగాడు. 314 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ ను ప్రారంభించనుంది.

Related Posts