YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కిషన్ రెడ్డి కి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది: దత్తాత్రేయ

కిషన్ రెడ్డి కి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది: దత్తాత్రేయ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా ఉన్న కిషన్ రెడ్డికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేసారు.శుక్రవారం ఇక్కడ మీడియా సమసవేశంలో మాట్లాడుతూ  బీజేపీలో రాజకీయ ప్రస్థానం 1980లో ప్రారంభమైందని,*నాకు టికెట్ ఇవ్వమని ఎప్పుడు అధిష్ఠానాన్ని కోరలేదన్నారు.పార్టీ నాకు ఎన్నో ఆవకాశాలు ఇచ్చింది. నాకు పూర్తి సంతృప్తి ఉందన్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా ఉన్న కిషన్ రెడ్డికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు.బీజేపీ వేగంగా అడుగులువేస్తూ ముందుకు వెళ్తోందన్నారు.కేటీఆర్ చెబుతున్నట్లు వంద శాతం సీట్లు టిఆర్ఎస్  వస్తాయనుకోవడం భ్రమ అన్నారు.మాది జాతీయ పార్టీ. టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమే నన్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సిపిఎం లు మాత్రమే నేషనల్ క్యాడర్ ఉన్న పార్టీలన్నారు.కాంగ్రెస్ వాళ్ళ లీడర్లను పోగొట్టుకొంటుందని పేర్కొన్నారు.దేశం కోసం కేసీఆర్ కాదు. దేశం కోసం మోదీ అన్నారు.కేసీఆర్ కు తెలిసిన హిందూత్వం కేవలం పూజలు, యాగాలు మాత్రమే నన్నారు.బీజేపీ చెప్తున్న హిందూత్వం జాతీయతకు సంబంధించిందని స్పష్టం చేసారు.. కేసీఆర్ కుఒకస్పష్టమైనఆలోచనవిధానంలేదన్నారు.రామమందిరం గూర్చి స్పష్టంగా మాట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు.నేను సిటు ఇవ్వలేదు అని పార్టీ మరే వాడిని కాదన్నారు.తెలంగాణ లో అన్ని  జిల్లాలు పర్యటిస్తానని తెలిపారు.సునీత లక్ష్మారెడ్డి పార్టీ లోకి ఆహ్వానించమన్నారు.మంచి జరుతుంది అని బావిస్తున్నాము.వివిధ పార్టీల నుండి బీజేపీ వస్తారు కానీ బీజేపీ నుండి ఎవరు పోరన్నారు.

Related Posts