YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోట్లాది కుటుంబాలను దగా చేసిన కాంగ్రెస్

కోట్లాది కుటుంబాలను దగా చేసిన కాంగ్రెస్

హైదరాబాద్
మంగళవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన తో  రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  నోటికొచ్చిన హామీలు,  నోటికి వచ్చిన వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి  గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు మాది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు. తెల్లారి లేస్తే అరుపులు, గావుకేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు.  తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి  విసిరితే స్వీకరించి నేను వచ్చాను. బేసిన్ నాలెడ్జి లేని రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ ను స్వీకరించాను.  బేసిన్ నాలెడ్జ్ , బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే ఓ 72 గంటల టైం ప్రిపరేషన్ కోసం ఇచ్చి రమ్మన్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను.  జులై 8 తారీఖున  11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్ కు వస్తాము, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే ఇవాళ రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండు.  ఒకవేళ ముఖ్యమంత్రి  రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నానని అన్నారు.
కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయింది.  రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయింది.  రేవంత్ రెడ్డికి బేసిన్ ల గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏ ప్రాజెక్టు బేసిన్లో ఉంది అని  ఇరిగేషన్ అధికారులను ఒక చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా  మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్, , కేసీఆర్  తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికను కల్పించారు.
ఈ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడని అన్నారు.
తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఆయన గురువు చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడు. కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చ జెండా ఊపుతున్నడు.  పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు.  నీళ్లేమో ఆంధ్రకు పోతున్నాయి. నిధులు ఢిల్లీకి పోతున్నాయి. తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్, మురిసిపోతున్నాడు.  కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు  కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఇవాళ తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసు.
తెలంగాణ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసిఎం అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని ఏ వర్గానికి రేవంత్ రెడ్డి మేలు చేయలేదు. రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చా. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వచ్చాను. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చానని అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల మా దగ్గర ఉన్నాయి.  రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొని వచ్చా.  ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక్క ఆధార్ కార్డుతో ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా ఇస్తామంటే చెప్పులను క్యూలో  పెట్టి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురుచూస్తున్నారు.  మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చింది  కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయి.  ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

Related Posts