YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు.

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు.

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు తెలంగాణా ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. పదోన్నతులు ఇస్తూ మొత్తం 15 జీవోలు జారీ చేసింది. 2 6 ఐఏఎస్ ల పదోన్నతులు రాగా ముగ్గురు  సోమేశ్ కుమార్, ఆధార్ సిన్హా, షాలిని మిశ్రాలకు  ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి,ఆరుగురికి కి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఐదుగురు ఐఏఎస్ లకు సంయుక్త కార్యదర్శి, మరో నలుగురికి  డెప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
అలాగే, 23 మంది ఐపీఎస్ లకు  పదోన్నతులు వచ్చాయి. ఐదుగురు ఐపీఎస్ లకు అదనపు డీజీలుగా పదోన్నతిరాగా,  నలుగురు ఐపీఎస్ లకు ఐజి,ఏడుగురు  ఐపీఎస్ లకు డీఐజీ లుగా, ఆరుగురు రు ఐపీఎస్ లకు సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజి గా పదోన్నతి లభించింది. 

Related Posts