YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటర్ రీకౌంటింగ్ గడువు పెంపు

ఇంటర్ రీకౌంటింగ్ గడువు పెంపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం, నిరసనల హోరు నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ దరఖాస్తు గడువును పొడిగించుకుంది. ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. దీంతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి సంబంధించిన గడువును కూడా పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు ఈ గడువు ఏప్రిల్ 25 వరకు ఉండగా.. అదనంగా మరో రెండు రోజులు అవకాశం కల్పించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు టీఎస్‌ ఆన్‌లైన్‌ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌.. మంగళవారం వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపరుకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్షలో పాసైన మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంప్రూమ్‌మెంట్ కోసం ఒక్కో పేపరుకు రూ.150 చెల్లించాలి. ఫలితాల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దరఖాస్తు, ఫీజు చెల్లింపులో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది.మరోవైపు.. ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో సమావేశమైంది. అటు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. 

Related Posts