YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీగా నష్టపోయిన మార్కెట్లు

 భారీగా నష్టపోయిన మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ఏకంగా 372 పాయింట్లు పతనమైంది. 37,091 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 11,148 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెవీవెయిట్ షేర్లు పడిపోవడం మరీముఖ్యంగా ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కుప్పకూలడం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లపై ప్రతికూల ప్రభావం చూపింది. నిఫ్టీ 50లో టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటొకార్ప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ 1 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో ఐషర్ మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ ఫార్మా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐఓసీ షేర్లు నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ ఏకంగా 8 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ మినహా మిగతావన్నీ నష్టపోయాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. ఆటో, మెటల్ షేర్లు కూడా బాగా పడిపోయాయి.

Related Posts