YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జిగేల్ మన్న బంగారం

జిగేల్ మన్న బంగారం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర మళ్లీ జిగేల్‌మంది. దేశీ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.377 పెరుగుదలతో రూ.33,395కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం ప్రధాన కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.38,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.29 శాతం తగ్గుదలతో 1,298.05 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం క్షీణతతో 14.76 డాలర్లకు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.377 పెరుగుదలతో రూ.33,395కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.377 పెరుగుదలతో రూ.33,225కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.38,300కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.267 పెరుగుదలతో రూ.37,557కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000కు, అమ్మకం ధర రూ.81,000కు పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,390కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,850కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,400కు చేరింది.

Related Posts