YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బందరులో 6400 ఇళ్ళకు నేడు శంకుస్థాపన

బందరులో 6400 ఇళ్ళకు నేడు శంకుస్థాపన

గురువారం భారీ ఎత్తున సామూహిక గృహనిర్మాణాల సముదాయానికి శంకుస్థాపన మచిలీపట్నంలో జరగనుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల నెరవేర్చడానికి మంత్రి కొల్లు రవీంద్ర చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. దానిలో భాగంగా గురువారం గోసంఘం, రుద్రవరం భూముల్లో శంకుస్థాపన మహోత్సవాలు జరగనున్నాయి. 360 కోట్ల విలువైన 6400 గృహాల సముదాయాల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు వచ్చారు. రుద్రవరంలో జిం3 హౌసింగ్ కాలనీకి మంత్రి రవీంద్ర గురువారం ఉదయం శంకుస్థాపన చేస్తారు. అనంతరం మంత్రులు దేవినేని ఉమాల, పి.నారాయణతో కలసి కొల్లురవీంద్ర గోసంఘం స్థలంలో జిం3 ఇళ్ళకు శంకుస్థాపన చేయనున్నారు.

Related Posts