YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 204 పాయింట్లు నష్టపోయింది. 37,115 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 11,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐఓసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, టైటాన్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. అదేసమయంలో యస్ బ్యాంక్, టాటా మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, కోల్ ఇండియా, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ ఏకంగా 9 శాతం పడిపోయింది. టాటా మోటార్స్ కూడా 7 శాతానికి పైగా క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ మాత్రం లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు ఎక్కువగా పడిపోయాయి

Related Posts