YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్‌కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం

Highlights

  • రేవంత్‌ రెడ్డి వల్ల  టీడీపీకి చెడ్డపేరు 
  • ఓటుకు నోటు కేసుతో టీటీడీపీ పరిస్థితి..?
  • రేవంత్‌ని మెడ పెట్టి గెంటేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు
  • "తెలంగాణ"లో బాబు పర్యటించాలి.. 
  •  సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు
టీఆర్ఎస్‌కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం

తెలుగు దేశం పార్టీని వీడిన రేవంత్‌ రెడ్డిని అప్పుడే మెడలు పట్టి పార్టీ నుంచి బయటకు గెంటేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి టీడీపీకి చెడ్డపేరు తీసుకువచ్చారని అన్నారు.శుక్రవారం  హైదరాబాద్‌లో అయన  మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజున్న పరిస్థితులు ఏంటీ? రేవంత్‌ రెడ్డి చేసిన ద్రోహాన్ని పార్టీలో ఎవ్వరూ అడగడం లేదు.. పార్టీ పరువును తీశాడు రేవంత్‌ రెడ్డి. చంద్రబాబు లాంటి నాయకుడికి రేవంత్‌ రెడ్డి తలవంపులు తెచ్చారు. తానూ "టీటీడీపీకి నేను వ్యతిరేకం కాదు.ప్రస్తుత పరిస్థితులు ఏంటీ? ప్రశ్నించారు.రాజకీయ సిద్ధాంత పరంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కచ్చితంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవసరం ఉంది. నేను ఎందుకు చెబుతున్నానంటే రేవంత్‌ రెడ్డిలాంటి వారు పార్టీని చీల్చి కాంగ్రెస్‌ పార్టీలోకి కార్యకర్తలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.దాంతో  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన పార్టీ వెనకపడి పోయిందన్నారు. పార్టీని కాపాడుకోవాలనుకుంటోన్న నాలాంటి వాడికి ఎంత బాధ ఉంటుందన్నారు. ఐదారుగురు తప్ప టీటీడీపీలో ఎవరైనా నాయకులు ఉన్నారా? నేను పార్టీలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నానని చెప్పారు. రాజకీయ సిద్ధాంత పరంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కచ్చితంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవసరం ఉందని స్పష్టం చేశారు. 2009లో మేము టీఆర్‌ఎస్‌తో కలిపే మహాకూటమి ఏర్పాటు చేశాం కదా?" అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ఆశీస్సులు పొందిన వారు చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్‌ లో ఉన్నారని గుర్తు చేశారు.  కాగా ముఖ్యంగా పది లక్షల మంది తెలంగాణ టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు మనో ధైర్యం నింపాల్సి ఉంది పార్టీలో ఎన్నో ఇబ్బందులున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు   తెలంగాణలో పర్యటించి  ముఖ్యంగా పది లక్షల మంది కార్యకర్తల్లో మనో ధైర్యం నింపాలన్నారు . కొన్ని చోట్ల తిరుగుతామని చంద్రబాబు చెప్పారు. మన బలాన్ని పెంచుకోవాల్సి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడం లేదనే బాధతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. అంతే తప్పా తెలంగాణ టీడీపీ నాయకులే ఈ రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం సరికాదు.

Related Posts