YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దార్మికుని కధ

దార్మికుని కధ

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

కాశీ పట్టణంలో, కేదారేశ్వర ఘాట్లో, దక్షిణాన, రామ వాటిక వుంది . దాని ముందు గంగా తీరంలో, జానకీ నాధుడు, వున్నాడు. అయోధ్యలో శ్రీ రాముని విగ్రహం ఉన్నట్లుగా, ఇక్కడ శ్రీరామునిమూర్తి అద్భుతంగా వుంటుంది.
ఆయన పాదపద్మాల చెంత, హనుమ కూర్చుండి, భక్తుల మనోభీష్టాలను నెర వేరుస్తుంటాడు.రామవాటికలో ధార్మికుడు అనే వేదాధ్యయనుడైన   బ్రాహ్మణుడున్నాడు. అతని కుమారుడు ధర్మకీర్తి.
సదాచారి ,వినయ సంపన్నుడు. పితృ సేవా పరాయణుడు. పదహారేళ్ళ ప్రాయంవాడు .మహాప్రాజ్ఞుడు
అయినా ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూనే వుంది .ధన సంపాదన కోసం, చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ క్షేత్రం చేరాడు . గోకర్ణేశ్వరుడిని అర్చించి , పూర్వజన్మ వాసన వల్ల ఇంటిని మరిచి పోయి, అక్కడే చాలా కాలo ? స్వామి సేవలో ఉండిపోయాడు.

అక్కడ కాశీలో, భార్యాపిల్లలు, ధర్మకీర్తి జాడ తెలియక, బాధ పడుతున్నారు .కనపడిన ప్రతి యాత్రికుడిని, తన కుమారుడు ధర్మకీర్తి, ఎక్కడైనా కన్పించాడా, అని అడిగేవాడు ధార్మికుడు . కొడుకు యెడబాటును, సహించలేక, నిత్యం దుఖిస్తూనే, ఉండేవాడు .
ఒకరోజూ సుతప్తుడు అనే బ్రాహ్మణుడు, ధార్మికుని వేదన చూసి, ”ధార్మికా! దుఃఖించ వద్దు .దైవ సహాయం ఇప్పుడు నీకు కావాలి .
భూత ,భవిషత్ ,వర్త మానాలను తెలియ జేసే, ”స్వప్నాoజనేయ మంత్రం" వుంది. నీకు దాన్ని
ఉపదేశిస్తాను.
నిరంతరం జపించి నీ పుత్రుని,
ఆయన అనుగ్రహంతో తిరిగి పొందు ”అని చెప్పి, మంత్రోపదేశం, చేశాడు. కలలో ఆంజనేయ స్వామి కనిపించి, ధర్మకీర్తి ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో కూడా, తెలియ జేస్తాడని కూడా చెప్పాడు .
ధార్మికుడు ఏకాగ్ర చిత్తంతో రామ వాటికలోని శ్రీ రామ సన్నిధిలో కూర్చుని, మంత్రాన్ని జపిస్తున్నాడు . ఒక రోజు, కలలో హనుమ కన్పించి, ”ధార్మికా ! నీ కుమారుడు క్షేమం గా గోకర్ణంలో ఆరోగ్యంగా స్వామి సేవలో గడుపుతున్నాడు.


తనంతట తానే,  మీ వద్దకు తిరిగి వస్తాడు. నన్ను స్వప్న హనుమంతునిగా భావించు.  స్వస్తి .”అని చెప్పి, మారుతి అదృశ్యమైనాడు .ఆకష్మికంగా జరిగిన ఈ సంఘటన, అతనికి ఆశ్చర్యం కలిగించిoది.
ఉదయం నిద్రలేచి, తన కలను, అందరికి తెలియబరచాడు.
అందరు ఆంజనేయ వైభవాన్ని, దార్మికుని అదృష్టాన్ని, పొగిడారు . పుత్రుని రాకకోసం ఎదురు చూస్తూ , ఆంజనేయ జపాన్ని, చేస్తూనే వున్నాడు ధార్మికుడు .
అక్కడ గోకర్ణ క్షేత్రంలో, తనను అత్యంత భక్తీ విశ్వాసాలతో కొలుస్తున్న, ధర్మ కీర్తి సేవలను ప్రస్తుతించి ,కాశీక్షేత్రంకు వెళ్లి, తలిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చమని, హితవు చెప్పి , గోకర్ణేశ్వరస్వామి వెళ్ళటానికి అనుమతి నిచ్చాడు.
అతడు శివుని ఆజ్న ను శిరసావహించి కాశీకి ప్రయాణమైనాడు. కొన్ని రోజులకు కాశీ చేరి, ఇంటికి వచ్చాడు . తలిదండ్రుల ఆనందం వర్ణించ లేకుండా వుంది . అందరికి నమస్కారాలు చేసి ,
బంధువులను పలకరించాడు .  కాశీ విశ్వనాధుని నిత్యం సేవిస్తూ, ఆంజనేయ ఉపాసన పొంది, రోగాలు లేకుండా ,
ఆరోగ్యంగా జీవిస్తూ , చివరకు మోక్షాన్ని పొందాడు.
”స్వప్న హనుమంతుని ”దివ్య ప్రభావం అంత గొప్పది అని, ధార్మిక ,ధర్మకీర్తిల కధ మనకు తెలియజేస్తోంది.

Related Posts