YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో  స్టాక్ మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇండియన్ స్టాక్ మార్కెట్‌ సోమవారం లాభాల్లో ముగిసింది. ప్రారంభంలోనే 350 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన బెంచ్‌మార్క్ సూచీలు చివరి వరకు అదే లాభాలను కొనసాగించలేకపోయాయి. ముగింపులో లాభాలు తగ్గాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణం. ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 39,785 పాయింట్ల వద్ద ముగసింది. ఇక నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో బ్రిటానియా, టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా పెరిగింది. ఇన్ఫోసిస్ కూడా దాదాపు 2 శాతం జంప్ అయ్యింది.
✺ అదేసమయంలో బీపీసీఎల్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్, ఐఓసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్ 3 శాతానికి పైగా పడిపోయింది. యస్ బ్యాంక్ 2 శాతానికి పైగా నష్టపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఎక్కువగా (1.53 శాతం) నష్టపోయింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు బాగా ర్యాలీ చేశాయి. 1 శాతానికి పైగా పెరిగాయి.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.19 శాతం తగ్గుదలతో 63.17 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.13 శాతం పెరుగుదలతో 54.06 డాలర్లకు చేరింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. 0.14 శాతం తగ్గుదలతో 69.56 వద్ద ఉంది.
✺ కశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు దాదాపు 20 శాతం పతనమయ్యాయి. ఆ బ్యాంక్‌ మాజీ సీఎండీ అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడికావడం ఇందుకు కారణం.
✺ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 8 శాతం పడిపోయాయి. ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చే ప్రణాళిక మరింత జాప్యం కానుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
✺ అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆర్‌పవర్‌ 20 శాతం పతనమై రూ.4.94 స్థాయిని తాకింది.

Related Posts