YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రూ.1798 తో గో ఎయిర్ స్వ‌ల్ప‌కాల విహార‌యాత్ర‌

రూ.1798 తో గో ఎయిర్  స్వ‌ల్ప‌కాల విహార‌యాత్ర‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జీవితం ఒత్తిళ్ల‌మయం అయిపోయింది. విధి నిర్వ‌హ‌ణ‌, ట్రాఫిక్‌, టార్గెట్లు, స‌మావేశాలు, డెడ్‌లైన్లు, సంక్షోభాలు... ఇలాంటి వాటి కార‌ణంగా ఒత్తిళ్లు త‌ప్ప‌డం లేదు. అయితే, వీటి నుంచి స్వ‌ల్ప‌కాలం విరామం తీసుకోండి, మీ ప్రియ‌మైన వారితో క‌లిసి సంతోష‌క‌ర‌మైన స్మార్ట్ ప్ర‌యాణం చేయండి. కుటుంబంతో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్లాల‌నుకున్న‌పుడు, స్వ‌ల్పకాలం మ‌రియు సంతోష‌క‌ర‌మైన వారాంతాలు విహార‌యాత్ర‌కు స‌రైన‌విగా నిలుస్తాయి. అందుకే మీకు  స్వ‌ల్ప‌కాల విహార‌యాత్రల‌కు స్వాగ‌తం! హైద‌రాబాదీలు ఇప్పుడు గోఎయిర్ ద్వారా అతిత‌క్కువ‌గా రూ. 1798 ప్రారంభ ధ‌ర‌తో స్వ‌ల్ప‌కాల విహార‌యాత్ర‌లకు వెళ్లవ‌చ్చు. ఫ్లైస్మార్ట్ ధ‌ర‌ల‌ను సొంతం చేసుకునేందుకు బుకింగ్ తేదీలు - జూన్ 18-23, 2019 కాగా, ప్రయాణకాలం జూలై 01- సెప్టెంబ‌ర్ 30 మ‌ధ్య తేదీలు. గోఎయిర్ వెబ్‌సైట్  లేదా గోఎయిర్ మొబైల్ యాప్‌లో  ప్రోమో కోడ్ వాడ‌టం ద్వారా అదనంగా 10% త‌గ్గింపును వినియోగ‌దారులు సొంతం చేసుకోవ‌చ్చు.ప‌ట్ట‌ణ ప్రాంతంలోని సూత్రీక‌ర‌ణ ప్రకారం
మినికేష‌న్స్‌ అంటే అత్యంత‌ స్వ‌ల్ప‌కాల సెల‌వులు. వారంలోపు వ్యవ‌ధి క‌లిగి ఉన్నవి మ‌రియు వారం మ‌ధ్య‌లో వ‌చ్చే సెల‌వులు లేదా వారాంతాల్లో వచ్చే స్వ‌ల్ప‌కాల సెల‌వులు. హైదరాబాద్ నుంచి మినికేష‌న్స్ అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, ల‌క్నో, కోల్‌క‌తా, కోచిన్ మ‌రియు ఢిల్లీ సెక్టార్ల‌కు అందుబాటులో ఉన్నాయి.ఈ సంద‌ర్భంగా గోఎయిర్ అధికార ప్ర‌తినిధి మాట్లాడుతూ, ``భార‌త‌దేశం మారుతోంది. అదే స‌మ‌యంలో సెల‌వుల‌ను ఆస్వాదించే తీరులో తేడాలను గమనిస్తూ మేం వేగంగా విధానాలను మార్చుకుంటున్నాం. మా సంస్థ అంత‌ర్గ‌తంగా చేసిన పరిశోధ‌న‌ల ప్రకారం, అత్యంత స్వ‌ల్ప‌కాలం విరామం తీసుకొని వివిధ ప్రాంతాల‌ను చుట్టివ‌చ్చేందుకు, కొత్త ప్ర‌దేశాల‌లో ప‌ర్య‌టించేందుకు, ఆస‌క్తిక‌ర‌మైన నూత‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు మ‌రియు ఏడాదికోమారు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సెల‌వుల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం, ఏడాదిలో వివిధ ప్రాంతాల‌కు ప‌ర్య‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు అందులోనూ త‌మ బ‌డ్జెట్లోనే ఆ ప‌ర్య‌టన‌లు ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అత్యంత స్వ‌ల్ప‌కాల ప్ర‌యాణాల‌ను ఆస్వాదించేందుకు హైద‌రాబాదీల కోసం గోఎయిర్‌ ధ‌ర‌ల‌ను ప్రక‌టించి వారు ఫ్లైస్మార్ట్ ద్వారా సంతోష‌క‌ర‌మైన
అనుభూతుల‌ను సొంతం చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.హైద‌రాబాద్ నుంచి అత్యంత స్వ‌ల్ప‌కాల ప‌ర్య‌ట‌న‌లకు అవ‌కాశం క‌ల్పించే  గో ఎయిర్ ధ‌ర‌లు రూ.1,798 నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Related Posts