YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బీఎస్ఎన్ఎల్ కథ కంచికే

బీఎస్ఎన్ఎల్ కథ కంచికే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా? కార్యకలాపాలు కొనసాగించం కష్టమేనా? దీంతో కంపెనీ కథ ముగిసినట్లేనా? దీనికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కార్యకలాపాల నిర్వహణ గురించి సమాచారం అందించింది. వీలైనంత త్వరగా నిధులు అందించి ఆదుకోవాలని కోరింది. లేనిపక్షంలో కార్యకలాపాలు నిర్వహించడం కష్టమేనని పేర్కొంటోంది. జూన్ నెల వేతనాలు అందించడం కూడా కష్టమేనని తెలిపింది. కంపెనీకి రూ.13,000 కోట్ల అప్పులున్నాయి. నెలవారీ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉందని, ఈ నేపథ్యంలో తక్షణ నిధుల సాయం లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం దాదాపు అసాధ్యం’ అని బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ అండ్ బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ పురాన్ చంద్ర తెలిపారు. ఈ విషయమై టెలికం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఇందులోనే తదుపరి కార్యాచరణ గురించి కూడా సూచనలు కోరారు. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఎక్కవ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీల జాబితాలో బీఎస్ఎన్ఎల్ టాప్‌లో ఉంది. 2018 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ నిర్వహణ నష్టాలు ఏకంగా రూ.90,000 కోట్లు దాటాయి. అయితే బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరుద్ధరణ సూచనలు కానీ సలహాలు కానీ లభించడం లేదు. ఉద్యోగి వ్యయాలు ఎక్కువగా ఉండటం, పేలవమైన నిర్వహణ పనితీరు, మధ్యమధ్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం, 4జీ నెట్‌వర్క్ విస్తరణలో జాప్యం వంటి అంశాలు కంపెనీని దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ టెలికం కంపెనీలు 4జీ సహా కొత్త సాంకేతికతతో దూసుకెళ్తోంటో బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉంది. ఇప్పుడిప్పుడే 4జీ సేవలు అందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రెడీ అవుతుండటం గమనార్హం. ప్రభుత్వ రం సంస్థకు కేంద్రం నుంచి సరైన సహాయం లేకపోవడం విడ్డూరమే. కంపెనీలో దాదాపు 1.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Related Posts