YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పెరిగిన బంగారం ధర

మళ్లీ పెరిగిన బంగారం ధర

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.35,560కు ఎగసింది. బలమైన అంతర్జాతీ ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం పసిడి ధరపై సానుకూల ప్రభావం చూపింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా కేవలం రూ.10 పెరుగుదలతో రూ.32,600కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా రూ.360 పెరుగుదలతో రూ.40,360కు ఎగసింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. బంగారం ధర ఆరు రోజుల్లో (జూన్ 19-24 వరకు) ఏకంగా రూ.1,200కు పైగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,270 ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,160 ఎగసింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుతూపోతూనే ఉంది. బంగారం ధర ఔన్స్‌కు 1,400 డాలర్ల మార్క్ పైనే కదలాడుతోంది. సోమవారం 0.44 శాతం పెరుగుదలతో 1,406.15 డాలర్ల వద్ద కదలాడుతోంది. అదేసమయంలో వెండి ధర మాత్రం ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 15.31 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.34,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.33,310కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.360 పెరుగుదలతో రూ.40,360కు ఎగసింది

Related Posts