YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

700 రూపాయిలు పెరిగిన బంగారం

700 రూపాయిలు పెరిగిన బంగారం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. మార్కెట్‌లో నేడు బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గురువారం (జూలై 4) పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.680 పెరుగుదలతో రూ.35,770కు ఎగసింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధర పరుగులు పెట్టిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. ఈ బంగారం కూడా రూ.650 పెరుగుదలతో రూ.32,790కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర దాదాపు స్థిరంగానే ఉంది. రూ.40,580 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర భారీగానే పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.650 పెరుగుదలతో రూ.34,700కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.650 పెరుగుదలతో రూ.33,500కు ఎగసింది. మరోవైపు కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇది రూ.40,580 వద్దనే స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర మళ్లీ పరిగెత్తింది. 1,400 డాలర్ల మార్క్ పైనే కదలాడుతోంది. ఔన్స్ పసిడి ధర 0.10 శాతం పెరుగుదలతో 1,422.25 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 15.34 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts