YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పడిపోయిన బంగారం ధరలు

మళ్లీ పడిపోయిన బంగారం ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర మరోసారి భారీగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.190 తగ్గుదలతో రూ.35,680కు పతనమైంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.190 తగ్గుదలతో రూ.32,690కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.40,560 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పరిగెత్తింది. ఔన్స్‌కు 0.89 శాతం పెరుగుదలతో 1,425.25 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 15.29 డాలర్లకు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.34,600కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.33,400కు దిగొచ్చింది. వెండి ధర రూ.40,560 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts